నగరంలోని మెట్రో రైళ్లకు ఫ్లెక్సీల గండం తప్పడం లేదు. మరోసారి ఫ్లెక్సీలు మెట్రో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగించాయి. ఆదివారం మెట్రో రైల్ మళ్లీ నిలిచిపోయింది. ప్యారడైజ్ వద్ద ట్రాక్పై ఫ్లెక్సీ బోర్డు పడిపోవడంతో 20 నిమిషాల పాటు రైల్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫ్లెక్సీని తొలగించడంతో యథావిధిగా రాకపోకలు కొనసాగుతున్నాయి. రెండు నెలల్లో ఇటువంటి ఘటన జరగడం ఇది మూడో సారి.