మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలాన్ని నారాయణపేట జిల్లాలో కలపవద్దని చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. కొయిలకొండ మండలాన్ని నారాయణపేట జిల్లాలో కలుపవద్దని దమాయిపల్లి వద్ద రహదారిపై పలు గ్రామాల ప్రజలు రాస్తారోకో చేశారు. రోడ్డుపై వంట వార్పు చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులకు , ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. సీఐ పాండురంగారెడ్డి తలకు తీవ్రగాయామైంది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. దీంతో వెంటనే అదనపు బలగాలను అక్కడకు తరలించి పరిస్థతిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.