నిజామాబాద్ లోక్సభ బరిలో నిల్చిన రైతు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఇవాళ నిర్వహించాల్సిన ఈవీఎం అవగాహన సదస్సు కేంద్రం దగ్గర ఆందోళన చేపట్టారు. ఎన్నికను 15 రోజుల పాటు వాయిదా వేయాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తమకింకా గుర్తులే కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇటు ఈ ఉదయం 11 గంటలకు నిర్వహించాల్సిన అవగాహనా సదస్సును రైతుల ఆందోళన దృష్ట్యా అధికారులు సాయంత్రం 5 గంటలకు వాయిదా వేశారు.