కేశినేని నాని మరో ఆసక్తికర ట్వీట్

Update: 2019-06-06 06:21 GMT

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రముఖ కవి శ్రీశ్రీ మాటలను ఆయన గుర్తు చేశారు. పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్ళు తప్ప అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు. ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవ్వజూపిన లోక్ సభ టీడీపీ విఫ్ పదవిని వద్దన్నారు కేశినేని నాని. ఆ తర్వాత చంద్రబాబుతో సమావేశమై తనకు ఏ పదవి వద్దని, పార్టీలోనే ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ఉదయం తన ఫేస్ బుక్ ఖాతాలో కేశినేని నాని ట్వీట్ పెట్టారు. పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్ళు తప్ప అని అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయింది. దీన్ని చూసిన ఆయన అభిమానులు కేశినేని ఏదో అసంతృప్తితో ఉన్నారని, కీలక నిర్ణయం ఏదో తీసుకోనున్నారని కామెంట్లు చేస్తున్నారు. 

Full View

Tags:    

Similar News