అదిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబీకి వెళుతున్న ఇథియోపియా ఎయిర్లైన్స్ విమానం కుప్పకూలింది. బోయింగ్ 737 విమానం కుప్పకూలింది. అడీస్ అబాబా నుంచి నైరోబికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా విమానం ఎక్కడ కుప్పకూలింది. దుర్ఘటనలో ఎంతమంది మరణించారనే వివరాలు ఇంకా తెలియరాలేదు. విమానంలో 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం అడిస్ అబాబాలోని బోలె ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ నుంచి ఆదివారం ఉదయం 8:38గంటలకు విమానం గాల్లోకి ఎగిరిందని ఆ తర్వాత కొంతసేపటికే 8:44 గంటలకే ప్రమాదానికి గురైందని చెప్పుకొచ్చారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.