ఉత్తమ్ మాట నిలబెట్టుకోలేదు: దానం నాగేందర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికీ బుద్ది రాలేదని విమర్శించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికీ బుద్ది రాలేదని విమర్శించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఎందుకు ఓడిపోయాం తప్పులు ఎక్కడ జరిగాయో చూసుకోకుండా ఈవిఎం లపై పడి ఏడుస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతే గాంధీభవన్కు రానన్న ఉత్తమ్ మాట నిలబెట్టుకోలేదన్నారు. కాంగ్రెస్ నేతలకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. చంద్రబాబు జోలికి ఎవరు పోయారని ఆయనే తమ జోలికి వచ్చారని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్పై క్లారిటీ లేదంటున్నారని అయితే వారి ఫ్రంట్కు ఏమీ క్లారిటీ ఉందో చెప్పాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు.