మోడీ ఇలాకాలో ఇవాళ సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. 58ఏళ్ల తర్వాత గుజరాత్లో సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహల్గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్నారు. లోక్సభ ఎన్నికల వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.