నేడు రెండో విడత పరిషత్‌ పోలింగ్‌

Update: 2019-05-10 00:30 GMT

తెలంగాణలో నేడు రెండో విడత పరిషత్ ఎన్నికలకు సమయం ఆసన్నమయ్యింది. మొత్తం 1850 ఎంపీటీసీ, 179 జెడ్పీటీసీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనున్నది. 180 జెడ్పీటీసీలకు నోటిఫికేషన్ జారీకాగా జగిత్యాల ఏకగ్రీవం కావడంతో 179 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 1850 ఎంపీటీసీలకు 6146 మంది భరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సిబ్బందికి సామాగ్రి పంపిణీ పూర్తయ్యింది. అధికారులు సిబ్బందికి బ్యాలెట్ పేపర్లు ఇతర ఎన్నికల సామాగ్రిని అంద చేశారు. జడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్, ఎంపీటీసీ అభ్యర్థులకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లను వాడుతున్నారు. ఈసారి ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలుకు సిరా చుక్క పెట్టనున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. 

Similar News