రంజాన్ పర్వదినాన నిజామాబాద్లో విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్లో రంజాన్ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతిచెందాడు. ఖిల్లా చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పుల్లూరి ఆనందం ఫిట్స్ తో కుప్పకూలాడు వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే ఆనందం మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో కుటుంసభ్యులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. నంద్ స్వస్థలం సూర్యాపేట జిల్లా తుర్కపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కానిస్టేబుల్ ఆనందంకి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడుగా కాగా కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు పోలీస్ కమిషనర్ కార్తికేయ.