తెలంగాణ కాంగ్రెస్కు మరో షాక్...టీఆర్ఎస్లో చేరిన సునీతా లక్ష్మారెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్కు వరుస షాక్లు తగులుతూనే ఉన్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, సీనియర్ నేత సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేశారు. హరీశ్ రావు, కేటీఆర్లు సునీతా లక్ష్మారెడ్డికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, పద్మాదేవేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.