తెలంగాణలో కాంగ్రెస్ భూ స్థాపితం అయ్యిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అసెంబ్లీ ఎన్నికల్లో 103 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ కూడా మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికి అమరావతికి పారిపోయాడని అన్నారు. కేసీఆర్ను ప్రతి క్షణం తలచుకోనిదే కేసీఆర్కు నిద్ర పట్టదని, బాబు ప్రసంగాలు జనాలకు బోర్ కొడుతున్నాయన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కాదు కదా బాబు కనీసం విజయవాడలో అమ్మవారి గుడి ఫ్లైఓవర్ కూడా నిర్మించలేకపోయాని విమర్శించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.