తెలంగాణలో లోక్సభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు వలసల బాట పడుతున్న విషయం తెలిసిందే కదా. అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎట్టకేలకు స్పందించింది. కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ రానీ వారు పార్టీని వీడినంతమాత్రనా ఎలాంటీ నష్టమూ లేదని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ కుంతియా స్పష్టం చేశారు. ఇప్పుడు వెళ్లిన నేతలు ఒంటరయ్యాక మళ్లీ తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అసలు ఇలాంటి ఆటుపోట్లను కాంగ్రెస్ ఎన్నో చూసిందని, ఎప్పటికైనా టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీనిచ్చేది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని కుంతియా ధీమా వ్యక్తం చేశారు.