కాసేపట్లో సీఎం జగన్‌తో గౌతమ్ సవాంగ్ భేటీ

Update: 2019-05-31 03:43 GMT

కాసేపట్లో సీఎం జగన్‌తో గౌతమ్ సవాంగ్ భేటీ కానున్నారు. రేపు డీజీపీ‌గా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే తాడేపల్లిలో జగన్‌‌ నివాసానికి గౌతమ్ సవాంగ్ చేరుకున్నారు. మరోవైపు రేపు డీజీపీ ఠాకూర్‌కు వీడ్కోలు పలికి గౌతమ్ సవాంగ్‌కు స్వాగతం పలికేందుకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే తాడేపల్లిలోని నివాసం నుంచి ఏపీ సీఎం జగన్ కార్యకలాపాలను కొనసాగించనున్నారు. ఇవాళ పలు శాఖల అధికారులతో భేటీకానున్న జగన్ ఆర్థిక పరమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ‌్వర్రావుపైనా కొత్త ప్రభుత్వం బదిలీ వేటేసింది. ఆర్పీ ఠాకూర్‌‌ను ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగం డీజీగా బదిలీ చేసిన జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా సీనియర్ అధికారి గౌతం సవాంగ్‌ను నియమించిన విషయం తెలిసిందే.

Similar News