ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల పాలకమండళ్లను రద్దు చేయాలని నిర్ణయించారు. ఏపీ చారిటబుల్, హిందూ రిలీజియస్ ఇనిస్టిట్యూషన్స్, ఎండోమెంట్స్ చట్టం - 1987ను సవరించడం ద్వారా ఆర్డినెన్స్ను చలామణీలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఆర్డినెన్స్ కోసం కెబినేట్ ఆమోదం తప్పనిసరి కావడంతో ఈ నెల 8న జరగనున్న మంత్రి వర్గం ఏర్పాటు రోజే కేబినేట్లో పెట్టే అవకాశం ఉంది. కొన్ని సవరణలు ప్రతిపాదించి ఆ సవరణలకు తగిన విధంగా పాలకమండలిని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ను ప్రభుత్వం కోరనుంది. అలా కుదరని పక్షంలో 12న అసెంబ్లీ సమావేశాల్లో సవరణ బిల్లు పెట్టి పాలక మండళ్ల రద్దుకు నిర్ణయం తీసుకోనున్నారు.