సంపద సృష్టి గురించి వైసీపీ మేనిఫెస్టోలో లేదు: చంద్రబాబు

Update: 2019-04-07 05:58 GMT

టీడీపీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నేతలకు పిలుపునిచ్చారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఎలక్షన్ మిషన్-2019పై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి గురించి మేనిఫెస్టోలో చెప్పామని సీఎం వివరించారు. బీచ్ రోడ్డును జాతీయ రహదారితో కనెక్టివిటిపై మేనిఫెస్టోలో చెప్పామని, ఎయిర్ పోర్టులు, ఓడరేవుల అభివృద్ధి గురించి స్పష్టంగా చెప్పామన్నారు. సంపద సృష్టి గురించి వైసీపీ మేనిఫెస్టోలో లేదని ఆరోపించారు. రాజధాని, నదుల అనుసంధానం గురించి వైసీపీ అధినేత జగన్ చెప్పలేదని, అమరావతి అభివృద్ధి గురించి వైసీపీ మేనిఫెస్టోలో చెప్పలేదని విమర్శించారు. జిల్లాలు, మండలాల పారిశ్రామికీకరణపై జగన్‌కు అవగాహన లేదని చంద్రబాబు ఆరోపించారు.

Similar News