వివేకాను ఎవరు చంపారో తెలియాలి: చంద్రబాబు

Update: 2019-03-16 12:49 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులు ఎంతటివారైనా బయటికి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. హత్య జరిగితే గుండెపోటంటూ వాస్తవాలను దాచిపెట్టారన్న బాబు దోషులను కాపాడేందుకు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ఆరోపించారు. పోస్టుమార్టం రిపోర్ట్‌ వచ్చాక మాట మార్చారని సాక్ష్యాలను తారుమారు చేశారని మండిపడ్డారు. కేంద్రంలో అనుకూల సర్కార్ ఉందనే సీబీఐ విచారణ అంటున్నారని నారాచంద్రబాబు నాయుడు అన్నారు. దోషులను మోడీ కాపాడుతున్నారని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి ఎవరు చంపారో రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

Similar News