త్వరలో ఇంటికో స్మార్ట్ ఫోన్ : చంద్రబాబు

Update: 2019-03-21 12:05 GMT

టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి సెల్ ఫోన్ ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే డ్వాక్రా సంఘాలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చానని ఈసారి ప్రతి ఇంటికి పంచుతానని సాలూరు ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. సెల్ ఫోన్ సహా ఇతర టెక్నాలజీ తెలుగు రాష్ట్రాలకు తెచ్చిన ఘనత తనదేనన్న చంద్రబాబు వాటి వల్ల ప్రజలకు ఎన్నో ఉపయోగాలున్నయని గుర్తు చేశారు. ఏపీ రైతులు ఇబ్బంది పడొద్దని 24,500 కోట్ల రుణమాఫీని చేశామని, కేవలం రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని సైతం తీసుకొచ్చామని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని బాబు వాగ్దానం చేశారు.  

Similar News