రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టే లక్ష్యంగా చంద్రబాబు..

Update: 2019-02-26 05:21 GMT

2019 ఎన్నికల్లో భారీ మెజార్టే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు కార్యాచరణ ముమ్మరం చేశారు. రోజుకు రెండు పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు ఆయా స్ధానాల్లోని 14 అసెంబ్లీ సీట్లపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఏలూరు, నర్సాపురం పార్లమెంట్ స్ధానాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్ధుల ఎంపిక, ఆశావాహులు, బలాబలాలపై నియోజకవర్గ పరిశీలకులకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గాల వారిగా పార్టీ నేతలతో పరిశీలకుల చర్చలు జరిపి పూర్తి నివేదికను చంద్రబాబుకు అందజేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోటీ పడుతున్న అభ్యర్ధులు, బలాబలాలు ఇతర అభ్యర్ధుల సహకారం, అసంతృప్తులపై పూర్తి నివేదిక అందజేయనున్నారు.  

Similar News