ప్రధాని నరేంద్రమోడీ, ఆయన టీమ్ను దేశప్రజలు ఈ నెల 23న తిరస్కరించడం ఖాయమని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అంపైర్లు లేకుండా చేసి, రిఫరీ సిస్టమ్నే ధ్వంసం చేసేలా వ్యవహరిస్తున్న మోడీ టీమ్కు పరాజయం తప్పదని చంద్రబాబు ట్వీట్ చేశారు. నిబంధనల ప్రకారం సక్రమంగా ఆడే కొత్త టీమ్ను ప్రజలే ఎంపిక చేసుకుంటారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారని పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల షెడ్యూల్కు 73 రోజులు తీసుకున్న ఈసీకి 50శాతం వీవీ ప్యాట్లు లెక్కించడానికి మరో 6రోజులు తీసుకోవడానికి ఎందుకు అభ్యంతరం అని ఆయన ప్రశ్నించారు. వీవీ ప్యాట్లు లెక్కించాలని ఈసీని ప్రతిపక్షాలు అడిగితే మోడీకి ఏం సంబంధమని, ఆయనెందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు చంద్రబాబు.