ఎన్టీఆర్ 97వ జయంతి వేడుకల సందర్భంగా గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు పాల్గొన్నారు .. ముందుగా ఎన్టీఆర్ కి నివాళి అర్పించి.. అ తర్వాత ప్రసంగించారు .. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయంగా మిగిలిపోతారని తెలిపారు. ఆయన్ను చూసి మనం కష్టాలు మరిచిపోయి ముందుకు వెళ్లాలని చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇక తాను మూడున్నర దశాబ్దాలుగా ప్రజలకు అండగా ఉన్నానని ఇకపైనా కూడా అండగా ఉంటానని హమీ ఇచ్చారు. జీవితంలో ఇబ్బందులు వస్తాయని, వాటిని అధిగమించాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసానని తెలిపారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనని వాటిని స్పూర్తిగా తీసుకోని ముందుకు వెళ్తామని ప్రజలతోనే మా ప్రయాణమని చంద్రబాబు అన్నారు ..
ఇక ఈ ఎన్నికల్లో 40శాతం ఓట్లు మనకు వచ్చాయని అ కృతజ్ఞతతో మనం ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. లోపాలను సరి చేద్దామని తెలిపారు. పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకువద్దామని కార్యకర్తలకు సూచించారు.