చంద్రబాబు టూర్ షెడ్యూల్.. రెండు జిల్లాల్లో సుడిగాలి ప్రచారం

Update: 2019-03-24 03:40 GMT

వరుస బహిరంగ సభలు, రోడ్‌షోలతో ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రోజుకు మూడు నుంచి నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటున్న ఆయ ఈ రోజు కడప, చిత్తూరు జిల్లాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు బద్వేల్ బహిరంగ సభలో పాల్గొనున్న చంద్రబాబు 12.15కి రాయచోటిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.15కి చిత్తూరు జిల్లా పలమనేరులో బహిరంగ సభలో పాల్గొంటారు .అనంతరం మూడున్నర గంటలకు శ్రీకాళహస్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు . 7.30కి తిరుపతికి చేరుకున్న అనంతరం అక్కడే రోడ్ ‌షోలో పాల్గొంటారు . రాత్రి తొమ్మిది గంటలకు సత్యనారాయణ పురం జంక్షన్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు.

Full View  

Similar News