ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ. మళ్లీ తిరిగి అధికార పగ్గాలు చేపట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్గా చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కోసం తమ డేటా దొంగిలించి తమపైనే కేసులు పెట్టి బెదిరిస్తారా అంటూ విరుచుకుపడ్డారు. కేంద్రానికి పన్నులు కడుతున్నట్లే కేసీఆర్కి కూడా కప్పం కట్టాలేమో అన్నారు. తమ పోటీ జగన్తో కాదు టీఆర్ఎస్తో అన్న చంద్రబాబు కేసీఆర్ ఆటలు ఏపీలో సాగనివ్వబోమంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ఇకపై ఆయన ప్రధాని నరేంద్రమోదీ కంటే ఎక్కువగా కేసీఆర్ను టార్గెట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కేసీఆర్ కావాలా. చంద్రబాబు కావాలా అనే టీడీపీ నినాదానికి కౌంటర్గా వైసీపీ ఏం చేస్తుందో చూడాలి. అయితే ఇది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం సీఎం చంద్రబాబు కామెంట్ చేయడం ద్వారా అయితే ఇదే తరహాలో గతంలో సీఎం కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవం నినాదాన్ని ఎలా తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లారో ఇక ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఇదే తరహాలో ఏపీ సీఎం చంద్రబాబు పయనిస్తున్నట్టు అర్ధమౌతోంది.