బాబు ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీకి నేను రేడీ..:బైరెడ్డి

Update: 2019-03-20 10:12 GMT

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్ జిలానీలు పెరిగిపోతున్నా విషయం తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు. టీడీపీలో చేరే అంశంపై మంతనాలు జరిపారు. చంద్రబాబు ఆదేశిస్తే శ్రీశైలం నుంచి పోటీ చేయడానికి సిద్ధమని బైరెడ్డి తెలిపారు. తాను ఏ పార్టీలో ఉన్నా రాయలసీమ హక్కుల కోసం పోరాడుతానని చెప్పారు. పొరపాటున జగన్‌కు ఓటేస్తే రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళుతుందని, జగన్‌ సీఎం కావడం ఎన్నిటికీ కలగానే మిగిలిపోతుందని బైరెడ్డి ఎద్దేవా చేశారు.

Similar News