రంజాన్ సందర్భంగా భారత్, పాకిస్తాన్ బార్డర్ వద్ద గార్డ్స్ మిఠాయిలు పంచుకున్నారు. అమృత్సర్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే అట్టారీ - వాఘా చెక్ పోస్టు వద్ద పాకిస్తాన్, భారత్ జవాన్లు రంజాన్ సందర్భంగా మిఠాయిలు పంచుకొని, పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు భారత సైనికులకు మిఠాయిలు ఇచ్చారు. ఇరు దేశాల జాతీయ, మతపరమైన పండగల సందర్భంగా రెండు దేశాలకు చెందిన జవాన్లు ఇలా స్వీట్లు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రధానిగా నరేంద్రమోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలా మిఠాయిలు పంచుకోవడం ఇదే ప్రథమం.