తెలంగాణలో పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కె. లక్ష్మణ్.హైదరాబాద్లోని బీజేపీ కార్యాయలంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో మోదీ, అమిత్ షా, ముఖ్యనాయకులు పాల్గొన్నారని, వారందరికీ తన ధన్యావాదాలన్నారు. అయితే తెలంగాణలో తక్కువ శాతం పోలింగ్ నమోదు అయ్యిందంటే అది కేవలం ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని తెలుస్తోందన్నారు.
కాగా ఈ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా గల్లంతు కానుందని, కాంగ్రెస్ కనుమరుగు కాబోతుందని జోస్యం చెప్పారు. ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ మాత్రమే ఉంటాయని అభిప్రాయపడ్డారు. తాము అనుకున్న వాటి కంటే ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. ఈ లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. కాగా వచ్చే నెల 23 తర్వాత నరేంద్ర మోడీ సర్కార్ ఏర్పడబోతోందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 5 గంటల నుంచి మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం, 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగింది. నిజామాబాద్లో ఎక్కువ అభ్యర్థులు పోటీ చేస్తుండటం ఎక్కువ ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ను నిర్వహించారు. ఏపీ, తెలంగాణతోపాటు 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 91 లోక్సభ స్థానాలకు ఓటింగ్ క్లోజైంది. చెదురుమదురు ఘర్షణలు మినహా తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.