బీజేపీ విందు రాజకీయం

Update: 2019-05-21 13:54 GMT

ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎన్డీయే పక్ష నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఎన్డీఏ పక్షాల సమావేశానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ కీలక నేతలు హాజరయ్యారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ భేటీ అనంతరం, ఎన్డీఏ పక్ష నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని అశోకా హోటల్ లో ఈ విందు ఇస్తున్నట్టు తెలుస్తోంది. మళ్లీ ఎన్డీఏదే అధికారమని ఎగ్జిట్ పోల్స్‌ చెప్పడంతో మిత్రపక్షాలకు అమిత్‌షా విందు ఇస్తున్నారు. 

Similar News