టీఆర్ఎస్‌ లిస్ట్‌ ప్రకటించగానే.. బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌...పలువురు సిట్టింగులతో ...

Update: 2019-03-20 01:36 GMT

బీజేపీ అధిష్టానం ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపింది. మాజీమంత్రి డీకే అరుణను పార్టీలోకి ఆహ్వానిస్తూనే మరికొందరు కాంగ్రెస్‌ సీనియర్లతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ నేతలతో నేరుగా చర్చలు జరుపుతున్నారు. అధికార టీఆర్ఎస్‌ నుంచి పలువురు నాయకులతో కూడా బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. రేపు టీఆర్ఎస్‌ లిస్టు ప్రకటిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అయితే టిక్కెట్‌ వచ్చే అవకాశం లేని వారితో పాటు పలువురు సిట్టింగులతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు ఇవాళ ఉదయం ఢిల్లీకి రావాలంటూ అమిత్‌ షా ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. అమిత్ షా సమక్షంలో డీకే అరుణ కాషాయ తీర్థం పుచ్చుకోనుండటంతో లక్ష్మణ్‌ కూడా అకస్మికంగా ఢిల్లీకి రావాలంటూ ఫోన్‌ రావడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. 

Similar News