టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు. కేవలం నారా చంద్రబాబు నాయుడు ఓటమి భయంతోనే ఈసీ, ఈవీఎం, నరేంద్రమోడీన బాబు లేని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో జీవీఎల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు డీఎంకేకు ఎందుకు మద్ధతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని అడిగారు. అసలు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చెప్పారా అని సూటిగా ప్రశ్నించారు.
చంద్రబాబునాయుడు మిత్ర ధర్మంలో భాగంగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. డీఎంకే పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న నేపథ్యంలో జీవీఎల్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు అక్కడి సీఎం కుమార స్వామి ఏమైనా మద్ధతిచ్చారా అని ప్రశ్న సంధించారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకునే పార్టీలతో బాబు జతకడుతున్నారని విమర్శించారు. ఆంధ్రా ప్రయోజనాలకు అడ్డుపడుతోంది చంద్రబాబేనని స్పష్టంగా పేర్కొన్నారు.