బీజేపీ కాన్వాయ్‌పై మావోయిస్టుల దాడి : ఐదుగురు మృతి

Update: 2019-04-09 12:27 GMT

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. దంతెవాడలో బీజేపీ ఎమ్మెల్యే కాన్వాయ్‌ టార్గెట్‌గా మందుపాతర పేల్చారు. ఈ అటాక్‌లో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవితోపాటు ఐదుగురు భద్రతా సిబ్బంది మృత్యువాతపడ్డారు. బీజేపీ ఎంఎల్‌ఏ భీమా మాండవి టార్గెట్‌గా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. కాగా ఈ దాడిలో ఎమ్మెల్యే భీమా మాండవి ఆచూకీపై ఆందోళన నెలకొంది. మరోవైపు భద్రతా బలగాలు , మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని పూర్తి వివరాలు అందాల్సి ఉంది. 




 


Similar News