విశాఖ ఎయిర్పోర్టులో వైసీపీ అధినేత జగన్పై జరిగిన దాడి ఘటనపై ఎన్ఐఏ విచారణ వేగవంతం చేసింది. నిందితుడు శ్రీనివాస్ను కస్టడీకి తీసుకున్న ఎన్ఐఏ.. ఐదోరోజు విచారణ నిర్వహిస్తోంది. జైల్లో శ్రీనివాసరావు రాశాడంటున్న 24 పేజీల లేఖపై విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎయిర్పోర్టు క్యాంటిన్ ఓనర్ హర్షవర్ధన్తో పాటు మరికొందరికి ఎన్ఐఏ నోటీసులు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా ఇవాళ వారి స్టేట్మెంట్ కూడా రికార్డు చేయనున్నట్టు తెలుస్తోంది.