ఆంధ్రప్రదేశ్లో నూతన మంత్రివర్గ విస్తరణకు తేదీ ఖరారైంది. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం వచ్చే నెల 7న మంత్రివర్గ విస్తరణను చేపట్టనున్నారు. వచ్చే నెల 11 లేదా 12న అసెంబ్లీ సమావేశం కానుంది. కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం ఒక రోజు అసెంబ్లీ సమావేశం జరగనుంది. ఇప్పటికే సీఎస్తో అసెంబ్లీ అధికారులు చర్చించారు. వచ్చే నెలాఖరులో బడ్జెట్ సమావేశాలు పెట్టె ఆలోచనలో కొత్త ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు జూన్ 3 నుంచి 6 వరకు సీఎం హోదాలో శాఖల వారీగా అధికారులతో జగన్ సమీక్షలు నిర్వహించనున్నారు. దీనికోసం ఆయన సచివాలయానికి రానున్నారు. జగన్ కోసం సచివాలయంలోని మొదటి బ్లాక్లోని సీఎం కార్యాలయం సిద్ధమవుతోంది.