ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డీజీ నియామకం కోసం చంద్రబబాు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా ముగ్గురు ఏడీజీ స్థాయి అధికారుల పేర్లతో కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ జాబితాలో ఏడీజీ ఆపరేషన్స్లో పని చేస్తున్న నళినీ ప్రభాత్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్గా ఉన్న కుమార్ విశ్వజిత్, హోంగార్డుల విభాగం ఏడీజీ..కృపానంద త్రిపాఠి ఉజెలా ఉన్నారు.
ముగ్గరు ఐపీఎస్ అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టంచేయడంతో ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ఇంటెలిజెన్స్కు కొత్త డీజీ ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ కొత్త డీజీ నియామకంపై ఏక్షణంలోనైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.