ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు లేఖ

ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగించడంపై సీఎం చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు.

Update: 2019-01-12 08:54 GMT

ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగించడంపై సీఎం చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారంటూ లేఖలో చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రాలను భయపట్టే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు సంబంధంలేని విషయాల్లో ఎన్‌ఐఏ జోక్యం చేసుకుంటోందంటూ విమర్శించారు. ఎన్‌ఐఏ దర్యాప్తు కోసం ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. దేశ భద్రత, రక్షణ, ఉగ్రవాద చర్యల సమయంలోనే ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించేలా నిబంధనలు ఉన్నాయన్నారు. 

Similar News