టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎలక్షన్ మిషన్ 2019పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు దొంగ సర్వేలతో మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. మైండ్ గేమ్ మాత్రమే కాదని, జగన్ సైకో గేమ్స్లో కూడా దిట్టని విమర్శించారు. నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్గా వైసీపీ మారిందని, నేరగాళ్లతో జగన్ అభ్యర్ధులను ప్రకటించారని అన్నారు. ఈ ఎన్నికల్లో మన పోటీ నేరగాళ్లతోనన్నారు చంద్రబాబు. మరోవైపు విశాఖ భూ స్కాంలో ధర్మాన ప్రసాదరావు సూత్రధారి అని, కన్నెధార గ్రానైట్ తవ్వేసిన నిందితుడని ఆరోపించారు.