ఏపీ కేబినెట్ సమావేశం ఈనెల 14కి వాయిదా పడింది. కేబినెట్ మీటింగ్కి ఏర్పాట్లు చేయాలంటూ సీఎంవో నుంచి నోట్ రావడంతో ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపిన సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఏం చర్చించాలనుకుంటున్నారో చెప్పాలంటూ సీఎంవోను క్లారిటీ కోరారు. దాంతో ఫోని తుపాను నష్టం, కరవు, నరేగా నిధుల చెల్లింపుపై చర్చిస్తారంటూ సీఎంవో వివరణ ఇచ్చింది. అయితే కోడ్ నేపథ్యంలో 48గంటల ముందుగా కేబినెట్ అజెండాను ఈసీకి పంపి, మంత్రివర్గ సమావేశానికి అనుమతి తీసుకోవాల్సి ఉండటంతో ఏపీ కేబినెట్ మీటింగ్ ఈనెల 14కి వాయిదా పడింది.