ఏపీలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది. ఇందులో పురుష ఓటర్లు- 1,83,24,588, మహిళా ఓటర్లు -1,86,04,742, థర్డ్ జెండర్స్ ఓటర్లు- 3,761గా ప్రకటించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో40,13,770 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 17,33,667 మంది ఓటర్లు ఉన్నారు.
శ్రీకాకుళం 20,64,330
విజయనగరం 17,33,667
విశాఖపట్నం 32,80,028
తూర్పు గోదావరి 40,13,770
పశ్చిమ గోదావరి 30,57,922
కృష్ణా 33,03,592
గుంటూరు 37,46,072
ప్రకాశం 24,95,383
నెల్లూరు 22,06,652
వైఎస్సార్ కడప 20,56,660
కర్నూలు 28,90,884
చిత్తూరు 30,25,222
అనంతపురం 30,58,909