అంబేద్కర్ కు భారతరత్న బలవంతంగా ఇచ్చారు : ఒవైసీ

Update: 2019-01-28 07:33 GMT

ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో భారతరత్న అవార్డును బీఆర్ అంబేద్కర్ కు తప్పనిసరై ఇచ్చారు కాని హృదయపూర్వకంగా ఇవ్వలేదన్నారు. ఆదివారం మహారాష్ట్రలో ఓ సభలో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎంతమంది దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, పేదలు, అగ్రవర్ణాలైన బ్రాహ్మణులకు భారతరత్న అవార్డులు ఇచ్చారో చెప్పాలని ఒవైసీ కేంద్రాన్ని నిలదీశారు. తప్పని పరిస్థితుల్లో అంబేడ్కర్‌కు భారతరత్న అవార్డును ప్రకటించారని చెప్పుకొచ్చారు.  

Similar News