ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. వైమానిక దాడులపై కేంద్రం వివరణ ఇస్తోంది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ భవనంలో ఈ సమావేశం జరిగుతుంది. కేంద్ర విదేశీవ్యవహారా శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రభుత్వం తరఫున కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తో పాటు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాందాస్ అథవాలే హాజరుకాగా విపక్ష నేతలు గులాంనబీ ఆజాద్, డి.రాజా, సీతారాం ఏచూరి, ఒమర్ అబ్దుల్లా, ప్రఫుల్ పటేల్ తదితరులు హాజరయ్యారు.