ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో కల్తీ మద్యం తాగి 11 మంది మృత్యువాత పడ్డారు. ఈఘటనలో మరికొంతమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా రాణిగంజ్ లోని ఓ మద్యం దుకాణం నుండి మద్యాన్ని మద్యం సేవించిన చేసినట్లు తెలుస్తోంది. 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉనట్లు సమాచారం. బారాబంకి, రామ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని రాణిగంజ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.