పడవ బోల్తా; 8 మంది మృతి
కర్ణాటకలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. కార్వార్ సమీపాన సముద్రంలో పడవ మునిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
కర్ణాటకలో కర్వార్లో సోమవారం ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. కార్వార్ సమీపాన సముద్రంలో పడవ మునిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 26 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక బృందాలు ఇప్పటి వరకు 16 మంది మృతదేహాలను వెలికితీశాయి. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా జరుగుతున్నది. కర్వార్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న ఆలయానికి వెళ్లి పడవలో తిరిగుపయనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.