కర్ణాటకలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తున్న వేళ ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కుమారస్వామికి మద్దతు ఉపసంహరించకున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు నగేష్, శంకర్లు జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినట్టు ప్రకటించారు. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ సర్కార్ సుపరిపాలన అందించడంలో ఘోరంగా విఫలమైందని అందుకే మద్దతు వాపస్ తీసుకొంటున్నాట్లు తెలిపారు. కర్ణాటకలో తాము ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నట్లు స్వతంత్ర ఎమ్మెల్యేలు నగేష్, శంకర్ చెప్పారు. అందుకే కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నామని చెప్పారు. సుస్ధిర ప్రభుత్వం ఏర్పడే దిశగా తాము బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ప్రకటించారు.