నరమేథం!

Update: 2019-06-17 11:57 GMT

నైజీరియాలో ఉగ్రభూతం మళ్లీ ఒళ్ళువిరుచుకుంది. ఫుట్ బాల మ్యాచ్ చూస్తున్న వారిపై తన పంజా విసిరింది. బోకోహరాం ఉగ్రవాదులు ఫుట్ బాల్ చూస్తున్న వారిపై ఆత్మాహుతి దాడి చేశాయి. ఈ దాడిలో 30 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది గాయాలపాలయ్యారు. నైజీరియాలోని బోర్నో రాష్ట్ర ముఖ్యనగరం మైదుగురి సమీపంలో ఈ దాడి జరిగింది. కొండుగ అనే ప్రాంతంలో కొందరు ఫుట్ బాల్ అభిమానులు వీడియో థియేటర్ లో లైవ్ మ్యాచ్ చూస్తుండగా, ఓ వ్యక్తి అక్కడి వీడియో ఆపరేటర్ తో గొడవపెట్టుకుని తనను తాను పేల్చుకున్నాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులు మ్యాచ్ ను వీక్షిస్తున్న ప్రజల మధ్యకు వెళ్లి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మొదట 9 మంది ఘటనస్థలంలోనే ప్రాణాలు విడువగా, అంబులెన్స్ లు రావడంతో ఆలస్యం కావడంతో మరో 21 మంది తుదిశ్వాస విడిచారు. ఇది బోకోహరాం ఉగ్రవాదుల పనేనని నైజీరియా ప్రభుత్వం పేర్కొంది.

Tags:    

Similar News