రష్యాలో ఓ విమానం అత్యవసరంగా మొక్కజొన్న చేనులో ల్యాండ్ అయింది. యురల్ ఎయిర్లైన్స్కు చెందిన ఎయిర్బస్ 321కు పక్షుల గుంపు అడ్డు రావడంతో అప్రమత్తమైన పైలట్ డమిర్ యుసుపోవ్ విమానాన్ని అత్యవసరంగా మొక్కజొన్న చేనులో ల్యాండింగ్ చేశాడు. ఆ విమానంలో 223 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 23 మందికి గాయాలయ్యాయి. ప్రాణ నష్టం జరగలేదు. పైలట్ సమయస్ఫూర్తి వల్ల పెను ప్రమాదం తప్పిందని ఆ దేశ ఆరోగ్యశాఖా మంత్రి తెలిపారు. ఆ సమయంలో విమానంలో 223 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నట్టు పేర్కొన్నారు. విమానం హుకోవ్స్కీ నుంచి సిమ్ఫెరోపోల్ వెళ్తోందని తెలిపారు.