జపాన్లోని ఒసాకా వేదికగా జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. జపాన్, భారత్, అమెరికా దేశాధినేతల మధ్య జరిగిన త్రైపాక్షిక సమావేశం అనంతరం కొద్దిసేపు ఈ భేటీ జరిగింది. వాణిజ్యం, రక్షణ, 5జీ నెట్వర్క్పైనే ఇరువురు దేశాధినేతల మధ్య ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికారం చేపట్టిన మోదీకి ట్రంప్ అభినందనలు తెలిపారు. రక్షణ రంగం సహా ఇరుదేశాలు పలురంగాల్లో కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.