లైవ్ లో కొట్టుకున్నారు!

Update: 2019-06-25 05:29 GMT
fight in live show in pakisthan tv

రాజకీయ నాయకులు అర్థవంతంగా మాట్లాడటమే కష్టం. అందులోనూ టీవీ డిబేట్ లలో ఎదో ఒకటి మాట్లాడేస్తుంటారు. దాంతో.. ఒక్కోసారి ఆ షోలు రసాభాసగా మారటం మనకు తెల్సిందే. అయితే, పాకిస్తాన్ లో ఇటువంటి షో ఒకటి కొట్టుకునే వరకూ వెళ్ళింది. ఓ న్యూస్ ఛానల్ చర్చాకార్యక్రమంలో ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు పిడి గుద్దులు గుప్పించుకున్నారు.

ధికార పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ- ఇన్సాఫ్‌ (పీటీఐ) నేత మసూర్‌ అలీ సియాల్‌, కరాచి ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు ఇంతియాజ్‌ ఖాన్‌ ల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ చర్చా కార్యక్రమంలో ప్రభుత్వంపై ఇంతియాజ్ విమర్శలు గుప్పిస్తుండగా, ఇద్దరు నేతల మధ్యా మాటమాట పెరిగింది. సహనం కోల్పోయిన మసూర్‌ అలీ అతన్ని కొట్టారు. దీంతో ఇంతియాజ్ సైతం ప్రతిదాడికి దిగారు. దీంతో చర్చా కార్యక్రమం రసాభసగా మారగా, ఈ మొత్తం ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వీరిని విడదీసేందుకు యాంకర్‌ తో పాటు కార్యక్రమ నిర్వాహకులు కలుగజేసుకోవాల్సి వచ్చింది. ఫైటింగ్ తరువాత మసూర్‌ లైవ్ ను కొనసాగించగా, ఇంతియాజ్ మాత్రం వెళ్లిపోయారు. ఆ తరువాత చానెల్‌ తన లైవ్ షోను కొనసాగించింది. ఈ వీడియోను పాక్‌ కు చెందిన ఓ మహిళా జర్నలిస్ట్‌ తన ట్విట్టర్ ఖతాలో షేర్ చేసుకున్నారు. "దాడిచేయడమేనా నయాపాకిస్తాన్‌" అని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు.

Tags:    

Similar News