యాంకర్ గా తన కంటు ఓ స్థానం సంపాధించుకున్న అనసూయ అతి తక్కువ కాలంలోనే అశేష అభిమానులను సంపాదించుకుంది. అనసూయ ఏ ప్రోగ్రామ్ చేసిన అది టాప్ రేటింగ్ లో వుండాలసిందే ఒక వైపు టీవీ షోలు చేస్తునే మరో వైపు సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తుంది రంగస్థలం సినిమా తర్వాత అనసూయ చేస్తున్న మరో సినిమా యాత్ర..వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాలో అనసూయ రాజకీయ నాయకురాలి పాత్ర పోసించబోతుంది. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డిగా ఆయన లుక్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది.అయితే ఇందులో ఓ ముఖ్య మైన మహిళా నాయకురాలిగా అనసూయ కనిపించబోతుంది. దీనికి సంబంధించిన ఓ పిక్ ని సోషల్ మీడియాలో పెట్టింది అనసూయ. ఆమె ఏ మహిళా నాయకురాలి పాత్రలో కనిపిస్తుందో చూడాలి.
#Yatra #YatraTheMovie #Mammutty sir @MahiVraghav @70mmEntertains pic.twitter.com/R3DzVBIrhS
— Anasuya Bharadwaj (@anusuyakhasba) November 13, 2018