జగన్ కు బీజేపీ బంపర్ ఆఫర్

Update: 2018-07-16 05:58 GMT

కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న హైదరాబాద్‌కు వచ్చిన ఆయన.. ఏపీ రాజకీయాలపై సంచలన కామెంట్లు చేశారు. వైసీపీ అధినేత జగన్‌ను ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. తమతో కలిసి వస్తే జగన్‌ సీఎం అయ్యేందుకు సహకరిస్తామన్నారు. ప్రత్యేక హోదా విషయాన్ని తాను మోడీ, అమిత్‌ షాతో మాట్లాడతానని స్పష్టం చేశారు. మరోవైపు ఎన్డీయే నుంచి వైదొలిగే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని రాందాస్‌ చెప్పుకొచ్చారు. కొనసాగి ఉంటే ప్రధాని మోడీ సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేదని అన్నారు. 


 

Similar News