రేపే ప్రజాసంకల్ప యాత్ర పునఃప్రారంభం

Update: 2018-11-11 11:33 GMT

ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి 17రోజుల విరామం అనంతరం రేపట్నుంచి ప్రజాసంకల్ప యాత్రను పునఃప్రారంభించబోతున్నారు. అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌పై జరిగిన హత్యాయత్నంతో పాదయాత్రకు బ్రేక్‌ ఇచ్చారు. దాదాపు 17రోజుల చికిత్స, విరామం తర్వాత మళ్లీ రేపట్నుంచి జనంతో మమేకమవడానికి సిద్ధమవుతున్నారు. గాయం నుంచి కోలుకున్న జగన్‌ పాదయాత్ర కోసం బయల్దేరి వెళ్లారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విశాఖ బయల్దేరిన జగన్‌ ఈ రాత్రికే విశాఖ నుంచి విజయనగరం జిల్లా చేరుకోనున్న జగన్‌. రేపు ఉదయం మక్కువ నుంచి పాదయాత్రను తిరిగి కొనసాగించనున్నారు.

Similar News