ఎన్నో అంచనాల మధ్య పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో అజ్ఞాతవాసి విడులైంది. సినిమా విడుదలతో భారీ అంచనాలే పెట్టుకున్నారు అభిమానులు. అయితే అభిమానుల అంచనాలకు ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిపోయింది. దీంతో నిర్మాత సినిమాలో కొన్ని సీన్లు యాడ్ చేస్తే పనిలో పడ్డారట. అలా చేస్తే సినిమా మరికొన్ని రోజులు ఆడుతుందని భావిస్తున్నారట. ఇదిలా ఉంటే అజ్ఞాతవాసి లో విక్టరీవెంకటేష్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కాకపోతే సినిమా నిడివి పెరగడంతో దర్శకనిర్మాతలో వాయిస్ ఓవర్ కే పరిమితం చేశారు. ప్రస్తుతానికి సినిమా డిజాస్టర్ టాక్ తో విక్టరీసీన్లు యాడ్ చేస్తే అటు పవన్ అభిమానుల్ని, ఇటు వెంకటేష్ అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసుకోవచ్చుని అనుకున్నారట. దీంతో వెంకటేష్ - పవన్ కల్యాణ్ మధ్య షూట్ చేసిన సీన్లను యాడ్ చేసి సంక్రాతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే పవన్ - వెంకటేష్ ల మధ్య సీన్లు బాగుడడంతో సినిమా థియేటర్లలో మరికొన్ని రోజులు ఆడే ఛాన్స్ ఉంది.