కథానాయకుడి కథ హాస్పిటల్ లో మొదలవనుందట ?

Update: 2018-12-25 12:03 GMT

భారీ అంచనాల నడుమ ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్టు అయిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఆయన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో రానా దగ్గుబాటి, విద్యాబాలన్, నిత్యామీనన్, రకుల్ ప్రీత్ వంటి చాలా మంది స్టార్లు నటిస్తున్నారు. 

అయితే ఈ సినిమా ఓపెనింగ్ సీన్ గురించి ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా ఎన్టీఆర్ అవతారంలో ఉన్న బాలకృష్ణ క్యాన్సర్ హాస్పటల్ లో కి వెళ్ళడం తో మొదలవుతుందట. ఎన్టీఆర్ భార్య బసవతారకం కాన్సర్ తో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఓపెనింగ్ సీన్ లో ఆ హాస్పిటల్ లోని ఒక కుర్చీలో కూర్చొని ఎన్టీఆర్ తన కెరీర్ గురించి గుర్తు తెచ్చుకుంటూ ఉంటారట. అప్పుడు టైటిల్స్ పడి కథ మొదలవుతుందట. ఇది కనుక నిజమైతే ఈ సినిమా ఎమోషనల్ గా మొదలవుతుంది అనటంలో అతిశయోక్తి లేదు.

Similar News